తాండూర్ : విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకు రాష్ట్రోపాధ్యాయ సంఘం ( STU efforts )
75 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ( Venkateshwarlu) అన్నారు. బుధవారం మండలంలోని రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంఘ సభ్యత్వ నమోదులో ( Membership Drive) ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని పలువురు ఉపాధ్యాయులకు సభ్యత్వం నమోదు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పారదర్శకంగా చేయాలని, పాఠశాల స్థాయిలో కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో మండల విద్యాధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైన పనులను వెంటనే పూర్తిచేయాలని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకంటే ముందే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.