నిర్మల్ టౌన్, జనవరి 30 : మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వేతనాలను పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె నిర్వహిస్తున్నామని ఆ సంఘం నాయకులు మంగళవారం డీఈవో రవీందర్రెడ్డికి నోటీసు అందజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలని కోరారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి, ఐసీడీఎస్ కేంద్రాలకు బడ్జెట్ను పెంచాలని సీఐటీయూ జిల్లా నాయకులు పోశెట్టి అన్నారు. మంగళవారం నిర్మల్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ సమ్మెను 16న నిర్వహిస్తున్నామని, ఇందులో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శైలజ, తులసి, రాజమణి, అరుణ పాల్గొన్నారు.
కార్మికుల డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. మంగళవారం నిర్మల్లో ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, అశోక్ పాల్గొన్నారు.