రామగిరి, అక్టోబర్ 13: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. ఈనెల 21వ తేదీన సుమారు రూ.296 కోట్ల బోనస్ కార్మికులకు చె ల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎండీ శ్రీధర్ గురువారం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్మికుల తరఫున సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపా రు. కాగా, కార్మికుడికి గరిష్ఠంగా రూ. 76,500 రానున్నాయి. గతేడాది ఉత్ప త్తి లక్ష్యాల సాధనలో కృషి చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మే రకు 30 శాతం లాభాల వాటా రూ.368 కో ట్లను దసరా పండుగకు ముందే పంపి ణీ చేశారు. అలాగే పనితీరు ఆధారంగా చెల్లించే పీఎల్ఆర్ బోనస్ రూ.296 కోట్లు దీపావళి పండుగకు ముందు ఈ నెల 21న చెల్లిస్తున్నామని సీఎండీ తెలిపారు.
ఈ బోనస్ డబ్బులను కార్మికు లు కుటుంబ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని, సాధ్యమైనం త మేరకు పొదుపు చేసుకోవాలని సంస్థ సీఎండీ కార్మికులకు సలహా ఇచ్చారు. ఈ ఏడాది కూడా నిర్దేశిత 700 లక్షల టన్నుల బొగ్గు లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్మికుడు కృషి చేయాలని, తద్వారా సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాలు, సంక్షేమం, ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.