ఆసిఫాబాద్ టౌన్, మార్చి 26 : వరి కొనుగోలు కేంద్రాల్లో ఆఖరి గింజ వరకూ కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ మాట్లాడుతూ రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ, ఐకేపీ ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, సిబ్బంది తారామణి, నర్సింగరావు పాల్గొన్నారు.