ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనక లక్కేరావ్ మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్వగ్రామం తుమ్మగూడలో అంత్యక్రియలు నిర్వహించగా, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఏ పీవో చాహత్బాజ్పాయి, కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి తదితరులు తరలివచ్చి నివాళులర్పించారు. ఉపాధ్యాయ ఉద్యోగం వదిలి.. టీఆర్ఎస్లో చేరిన ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. గిరిజన సలహా మండలి (ఏటీడబ్ల్యూఏసీ) చైర్మన్గా రెండోసారి నియామకం కాగా, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు.
– ఉట్నూర్/ఇంద్రవెల్లి, ఆగస్టు 1
ఉట్నూర్, ఆగస్టు 1 : ఐటీడీఏ గిరిజన సలహా మం డలి (ఏటీడబ్ల్యూఏసీ) చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనక లక్కేరావు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉట్నూర్ మండల కేంద్రం లో ఉంటున్న లక్కేరావు కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెలో నొప్పివచ్చింది. హుటాహుటిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడకు చెందిన కనక లక్కేరావుది వ్యవసాయ కుటుంబం. కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. ఈయనకు భా ర్య అనసూయ, ఇద్దరు కుమారులు రమణ, కళ్యాణ్రావు ఉన్నారు. 2009లో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే ఏడాది బీఎస్పీ పార్టీ నుంచి ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేశారు. 2009 జూలైలో అప్పటి టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీలో చేరి జేఏసీ కన్వీనర్గా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ వస్తే గిరిజన ప్రాంతాలు బాగుపడతాయని ఊ రూరా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య పరిచారు. కేసీఆర్ ముందు చూపు నాయక త్వం నచ్చి మొదటి నుంచి బీఆర్ఎస్లోనే సాగుతున్నారు. ఆయన పార్టీకి నమ్మిన బంటుగా ఉన్నారు.
ఉద్యోగాన్ని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న కనక లక్కేరావును పార్టీ అధిష్ఠానం 2016లో ఉ ట్నూర్ ఐటీడీఏ గిరిజన సలహా మండలి(ఏటీడబ్ల్యూఏసీ) చైర్మన్గా నియమించింది. అప్పుడే ఇంద్రవెల్లి నుంచి ఉట్నూర్కు తన నివాసాన్ని మా ర్చుకున్నారు. 21-10-2023లో ప్రభుత్వం మళ్లీ ఐటీడీఏ చైర్మన్గా నియమించింది. ఐటీడీఏ తరపున నిర్వహించిన కార్యక్రమాల్లో కీలకపాత్ర పో షించి మన్ననలు పొందారు. గిరిజనుల సమస్యలను ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఆయన కృషి చేశారు.
స్వగ్రామం తుమ్మగూడలో మంగళవారం సాయం త్రం నిర్వహించిన లక్కేరావు అంత్యక్రియలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ఎంపీ గోడం నగేశ్తోపాటు ఎమ్మెల్యేజోగు రామన్న, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఆయా పార్టీల నాయకులు సిడాం భీంరావ్, ఆర్కా ఖమ్ము, కోట్నాక్ ర మేశ్, మర్సుకోల సరస్వతి, గోడం గణేశ్, పుర్కా బాపురావ్, అనిల్జాదవ్, జాన్స్నాయక్, శ్యామ్నాయక్, ఆడే శిల, అడ్డి భోజారెడ్డి, మారుతిపటేల్డోంగ్రే, ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులతో పాటు తుడుందెబ్బ నాయకులు, ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల, ఉపాధ్యాయులు, అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఆయా కుల సంఘ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి అంతక్రియాల్లో పాల్గొన్నారు.
కలెక్టర్ రాహూల్రాజ్, నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయితో పాటు మాజీ ఎంపీ గోడం నగేశ్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావ్, పద్మశ్రీ కనక రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామ్నాయక్, జాన్స్న్నాయక్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మనీషా, నేరేడిగోండ జడ్పీటీసీ అనిల్జాదవ్, ఇంద్రవెల్లి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఉట్నూర్ ఎంపీపీ పంద్రజైవంత్రావ్, మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యురాలు పెందూర్ నిలాదేవి లక్కేరావు మృతదేహం వద్ద నివాళులర్పించారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 1: ఐటీడీఏ ఏటీడబ్ల్యూ వో ఏసీ చైర్మన్ కనక లక్కేరావు హఠాన్మరణం పై రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్కేరావు గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయ న సేవలను కొనియాడారు. ఆయన మృతి గిరిజన జాతికి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.