ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నాగోబా ఆలయాన్ని సందర్శించి నాగోబాను దర్శించుకున్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ. . తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువకులు ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.
సమాజంలో విద్యా చాల ముఖ్యమైందన్నారు. నాగోబా ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజురూ చేసిందన్నారు. సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ మాట్లాడుతూ.. తమకు ఉన్నచోటే డబుల్ బెడ్ రూం, మినిబస్టాండ్ మంజూరు, గ్రామంలో సీసీరోడ్లు, కెస్లాపూర్ నుంచి హర్కాపూర్ ఎక్స్రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రంథాలయంలో సామగ్రితోపాటు పుస్తకాలు ఏర్పాటుకు తన నిధుల నుంచి రూ.50వేలు అందిస్తానని జడ్పీ చైర్మన్ తెలిపారు
కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు శేక్ సుఫియాన్, లక్కారాం మాజీ సర్పంచ్ మర్సుకోలా తిరుపతి, మెస్రం వంశీయులు నాగ్నాథ్, ఆనంద్రావ్, యూత్ సభ్యులు షెగ్నాథ్, తోడసం సాగర్, గణేశ్, జ్యోతిరాం, తదితరులు పాల్గొన్నారు.