ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 11 : నాగోబా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మెస్రం వంశీయులు ఆలయం వెనుక గల పెర్సపేన్(పెద్ద దేవుడు) దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. డోల్, సన్నాయి, కా లికోమ్ వాయిస్తూ మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్తోపాటు మెస్రం వం శీయుల పటేళ్లు చిన్ను పటేల్, బాజీరావ్ పటే ల్ ఆధ్వర్యంలో కోసు కటోడ, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్రావ్ పూజలు చేశారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో పెర్సపేన్కు జలాభిషేకం చేశారు. నవధాన్యాలతో నైవేద్యం వండి మొక్కులు చెల్లించుకుని, సహపంక్తి భోజనాలు చేశారు.
నాగోబా ఆలయం వెనుక భాగంలో ఉన్న బా న్ దేవతలకు మెస్రం వంశీయుల మహిళలు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు చేశా రు. గోవాడ్లో విశ్రాంతి పొందుతున్న మహిళలతోపాటు కొత్తకోడళ్లను సంప్రదాయ వా యిద్యాల మధ్య సతీదేవతల వద్దకు తీసుకొచ్చారు. గిరిజన మహిళలతోపాటు కొత్తకోడళ్లు మట్టికుండలతో కోనేరు వద్దకు వెళ్లారు. మెస్రం వంశీయుల అల్లుళ్లు నీటిని తోడి మట్టికుండలతోపాటు బిందెల్లో నీరుపోశారు.
అనంతరం మహిళలు మట్టికుండలను తలపై పెట్టుకుని బాన్దేవతల వద్దకు వచ్చారు. నీటిని కలుపుతూ ఏడు వరుసలతో కూడిన బౌలదేవతను తయారు చేశారు. వీటికి కొత్తకోడళ్లు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా.. గోవాడ్లో కొత్త కోడళ్లకు నాగోబా చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పర్ధాంజీలు మెస్రం రాము, గంగారాం కిక్రి వాయిస్తూ అవగాహన కల్పించారు.
నాగోబా జాతర సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో యేటా ప్రజాదర్బార్ను నిర్వహిస్తారు. ప్రజాదర్బార్కు మంత్రులతోపాటు జిల్లాస్థాయి అధికారులు హాజరై ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఐటీడీఏ ద్వారా మంజూరైన సంక్షేమ పథకాలను అక్కడే పంపిణీ చేస్తారు.