ఇంద్రవెల్లి, అక్టోబర్ 5 : మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బుధవారం దసరా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. దసరా పండుగ పూజలపై మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ సమక్షంలో చర్చించారు.
నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. గ్రామ పోలిమేరలో నుంచి తీసుకొచ్చిన జమ్మి ఆకులు నాగోబాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు చిన్నుపటేల్, బాధిరావ్, లింబారావ్, దేవ్రావ్, సోనేరావ్, నాగ్నాథ్, తుకారాం, దాదారావ్, గణపతి, తిరుపతి, కోసరావ్, మనోహర్, శేఖర్బాబు, మనుమంత్రావ్ తదితరులు పాల్గొన్నారు.