ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య( Quality Education) అందించడంతో పాటు వారి ఆరోగ్యం ( Education ) పై ప్రత్యేక దృష్టి సారించాలని ( Special attention ) జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ( Collector Venkatesh Dotre ) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, వంటశాల, భోజన నాణ్యత, విద్యా బోధన విధానం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్యను బోధించాలని, ముఖ్యంగా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
వచ్చే నెల నాటికి విద్యార్థులలో విద్య అభ్యసన సామర్ధ్యాల పురోగతి లేకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలన్నారు. తాజా కూరగాయలు, నిత్యవసర సరుకులు వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.