నార్నూర్, నవంబర్ 26 : కొలాం గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి అన్నారు. గాదిగూడ మండలం చిత్తగూడ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఉచిత బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని కొలాం గిరిజనులు పాల్గొన్నారు. ఎస్పీతో పాటు ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హాజరయ్యారు. వీరికి కొలాం గిరిజనులు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. 500 మంది పేద కొలాం గిరిజనులకు బ్లాంకెట్లు అందజేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నా రు. సమయాన్ని వృథా చేయకుండా ఆర్థికంగా అ భివృద్ధి చెందాలని పేర్కొన్నారు. విద్యతో పాటు వ్యవసాయం, వ్యాపార రంగాలపై దృష్టి సారించాలన్నారు. ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ వ్య వసాయం చేస్తే దిగుబడి వస్తుందన్నారు. విద్య తరగని ధనం, ఉన్నత చదువులతో ప్రయోజకులు కావాలని సూచించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన యువతీ యువకులు ఖాళీగా ఉండకుండా ఆ ర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.
ఐటీడీ ఏ ద్వారా ఉచిత మేళాలు నిర్వహిస్తూ, శిక్షణ పొం దిన వారికి పరిశ్రమల్లో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.ప్రస్తుతం పోలీస్శాఖలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. పోలీస్శాఖ తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. త్వరలోనే మెడికల్ క్యాంపు నిర్వహించి, వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సీఐ కే ప్రేమ్కుమార్, ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ ఖాన్, వైస్ ఎంపీపీ మార్సివనే యోగేశ్, సర్పంచ్ జాదవ్ యశోదబాయి, ఎంపీటీసీ రాథోడ్ కిరణ్, సురేశ్పటేల్, కొలాం గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సిడాం దేవ్రావ్, నాయకులు ఆడ రాజేశ్వ ర్, మెస్రం శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు.