ఆసిఫాబాద్, మార్చి3 : క్రీడలతో ఐకమత్యం పెరుగుతుందని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఎస్పీ లెవెన్ టీమ్ గెలుపొందింది. ఆర్మ్డ్ పోలీస్ టీమ్ రన్నర్గా నిలిచింది. ఎస్పీ మాట్లాడుతూ వాలీబాల్, బాడ్మింటన్, క్రికెట్ పోటీల్లో విజేతలకు త్వరలో హెడ్ క్వార్టర్స్లో జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, సీఐలు రాణాప్రతాప్, సతీశ్, శ్రీనివాస్, ఎస్ఐలు పాల్గొన్నారు.