ఆసిఫాబాద్, ఫిబ్రవరి 29 : నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీసు సాయుధ బలగాలకు వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాణాప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, సీఐ సతీశ్, ఆర్ఐ ఎంటీ అంజన్న, ఆర్ఐ స్పెషల్ పార్టీ షేక్ నాగుల్ మేర, సీఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.