ఎదులాపురం, జనవరి 30 : దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముందుగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పోతారం శ్రీనివాస్, కార్యాలయంలో ఏవో భక్తప్రహ్లాద్, ఆర్ఐ సీఐలు నవీన్, మురళి, సూపరింటెండెంట్లు సంజీవ్, గంగాధర్, సీసీ దుర్గం శ్రీనివాస్, ఫింగర్ ప్రింట్ నిపుణులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్పీని మహార్ సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యులు భీంరావు కాంబ్లే, మహిళా అధ్యక్షురాలు సవితాబాయిలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. వారి వెంట ప్రధాన కార్యదర్శి భీంరావు, రామారావు పాటిల్, యశ్వంత్రావు పాల్గొన్నారు.