నిర్మల్ అర్బన్, జనవరి 4 ః ఆదిలాబాద్ రీజియన్కు ఆరు నూతన బస్సులు మంజూరయ్యాయి. ఇందులో ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు ఉన్నాయి. 15 లక్షల కిలో మీటర్లు పూర్తి చేసినందున రీప్లెస్మెంట్లో భాగంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ రీజియన్లోని నిర్మల్ డిపోకు రెండు రాజధాని బస్సులు, ఒక ఎక్స్ప్రెస్.. ఆసిఫాబాద్ డిపోకు ఒక రాజధాని, ఒక ఎక్స్ప్రెస్.. మంచిర్యాల డిపోకు ఎక్స్ప్రెస్ బస్సును కేటాయించారు. త్వరలో ఇవి ప్రయాణికులకు సేవలు అందిస్తాయని తెలిపారు.