సీసీసీ నస్పూర్, జనవరి 3: సింగరేణి స్థలాల్లో ఇ ళ్లు కట్టుకొని ఉంటున్న వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే పట్టాలు అందుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలో మంగళవారం 120 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఇళ్ల పట్టాల కోసం కొట్లాడిన వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తన విన్నపం మేరకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సంప్రదించి పట్టాల పంపిణీకి సుముఖత వ్యక్తం చేశారని గుర్తు చేశారు. గతంలో శ్రీరాంపూ ర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ ని సీఎం నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. పట్టా లు తీసుకుంటున్న వారంతా ఆయనకు అండగా ఉండాలని కోరారు.
మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు పూదరి కుమార్, చిడాం మహేశ్, కెడిక ప్రకాశ్ రె డ్డి, కుర్మిళ్ల అన్నపూర్ణ, పంబాల గంగ, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరు గు పవన్, నాయకులు అన్నయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, మల్లెత్తుల రాజేంద్రపాణి, బాకం నగేశ్, ముక్కెర వెంకటేశ్, పెర్క సత్తయ్య, బోనాసి స్వామి, చెల్ల విక్రం, రఫిక్ఖాన్, శ్రీరాములు, వేల్పుల రవీందర్, తిప్పని రామయ్య, చిలుముల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.