శ్రీరాంపూర్, డిసెంబర్ 27: సింగరేణిలో బుదవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శ్రీరాంపూర్ డివిజన్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగింది. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన 7వ దఫా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 93 శాతం ఓటింగ్ జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలోని 8గనులు, 7 డిపార్ట్మెంటుల్లో మొత్తంగా 9,127 ఓటర్లు ఉన్నారు. 8491 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 93 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 15 బూత్లలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 80 మంది సిబ్బంది ఎన్నికలు నిర్వహించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జైపూర్ ఏసీపీ మోహన్ సందర్శించారు.
ఆర్కే 7గనిలో 1416 ఓట్లకుగాను 1319, ఆర్కే న్యూటెక్లో 692కి గాను 649 ఓట్లు, ఓసీపీలో 576కి గాను 555, ఆర్కే 6గనిలో 893 మందికి గాను 821, ఎస్ఆర్పీ 1లో 706 ఓట్లకు 672, ఎస్ఆర్పీ 3, 3ఏలో 1282కి గాను 1190, ఐకే 1ఏ గనిలో 1217కు గాను 1111, సీహెచ్పీలో 163కు 152, ఎస్ఆర్పీ ఎస్అండ్పీసీ, జీఎం ఆఫీస్ డిపార్ట్మెంట్లలో 828కి 779, ఆర్కే 5బీ గనిపై 800కు 726, ఆర్కే 5గనిలో 490కు గాను 456 ఓట్లు పోలయ్యాయి. జైపూర్ ఎస్టీపీపీలో 64కు 61 ఓట్లు పోలయ్యాయి. శ్రీరాంపూర్ ఏరియా ఎన్నికల ఇన్చార్జిగా ఆర్డీవో రాములు వ్యవహరించారు. శ్రీరాంపూర్ ఇన్చార్జి జీఎం సంజీవరెడ్డి, డీవైజీఎం అరవిందరావు పర్యవేక్షించారు. బందోబస్తును జైపూర్ ఏసీపీ మోహన్, శ్రీరాంపూర్ సీఐ రమేశ్, ఎస్ఐ రాజేశ్తో కలిసి పరిశీలించారు. గనుల ఎదుట ఎన్నికల బ్యాలెట్ నమూనాను పట్టుకొని ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ నాయకులు ప్రచారం చేశారు.
కేంద్రాలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు పెట్టం లక్షణ్, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, మాజీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, అర్గనైజింగ్ కార్యదర్శి తొంగల రమేశ్, నాయకులు భాస్కర్, రాజునాయక్, అన్వేశ్, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు శంకర్రావు, కుమారస్వామి, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు, సీఐటీయూ కార్యదర్శి భాగ్యరాజు, బీఎంఎస్ కార్యదర్శి నాతాడి శ్రీధర్రెడ్డి, ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షుడు బ్రహ్మానందం సందర్శించి ఓటింగ్ సరళిని పరిలించారు. అన్ని గనులపై యూనియన్ నాయకులు గేట్ ఎదుట ఉండి వారి వారి యూనియన్ గుర్తులు చూపిస్తూ ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
మంచిర్యాల అర్బన్/శ్రీరాంపూర్, డిసెంబర్ 27 : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు సింగరేణి ఎన్నికలను పరిశీలించేందుకు గనులపై తిరుగుతూ వెళ్తుండగా ఆర్కే 6 గని వద్ద ఓ కార్మికుడు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించిన ఎమ్మెల్యే వెంటనే కారు దిగి కార్మికుడు వెంకటేశ్ వద్దకు వెళ్లి చేతిలో తాళం చెవులు పెట్టి, తలకు గాయం కాగా కట్టుకట్టి వెంటనే తన వెనకాల ఉన్న పోలీసు వాహనంలో సమీప సింగరేణి దవాఖానకు తరలించారు. వైద్యుడితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
మందమర్రి, డిసెంబర్ 27: సింగరేణి మందమర్రి ఏరియాలో బుధవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఏరియాలో నాలుగు భూగర్భ గనులు, రెండు ఓసీలతో పాటు వివిధ విభాగాలలో 4,835 మంది కార్మికులు ఉన్నారు. 4515 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 93.40 శాతం పోలింగ్ నమోదైంది. గనుల పైన కార్యాలయాలు, క్యాంటీన్లలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, మందమర్రి సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్తో కలిసి పరిశీలించారు.
కాసిపేట, డిసెంబర్ 27 : కాసిపేట 1వ గనిలో రెం డు పోలింగ్ బూత్లు, కాసిపేట 2 ఇైంక్లెన్ గనిలో రెండు పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాసిపేట 1వ గనిలో 1204, కాసిపేట 2 ఇైంక్లెన్ గనిలో 732 మంది ఓటర్లు ఉండగా కాసిపేట 1వ గనిలో బూత్ నంబర్ 3లో 540 ఓట్లు పోలవగా 88.09 శాతం పోలింగ్ నమోదైంది. బూత్ నంబర్ 4లో 551 ఓట్లు పోల్ కాగా 93.33 శాతం పోలింగ్ నమోదైంది. కాసిపేట 2 ఇైంక్లెన్ గనిలో బూత్ నంబర్ 5లో 305 ఓట్లు పోల్ కాగా 91.32 పోలింగ్ నమోదైంది. బూత్ నంబర్ 6లో 365 ఓట్లు పోలు కాగా 91.71 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలను బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, ఎస్ఐలు గంగారాం, ఆంజనేయులు, కల్యాణం నరేశ్ పరిశీలించారు.
తాండూర్, డిసెంబర్ 27 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా బెల్లంపల్లి ఏరియా తాండూర్ మండల పరిధిలోని బీపీఏ ఓసీపీ-2 క్యాంటీన్లో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. 96 ఓట్లకు గాను 93 మంది ఓటు హకు వినియోగించుకోగా 97 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రిటర్నింగ్ అధికారి జగన్నాథ్ మహంతి, లేబర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి జగదీశ్, సింగరేణి ఎస్వోటూ జీఎం నరేందర్, ఎన్నికల అధికారులు సదానందం, మసూద్, హుస్సేన్, యశ్వంతరావు రాజకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
జైపూర్, డిసెంబర్ 27: సింగరేణి వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికలు శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారంఖని, ఇందారం ఓపెన్కాస్టు, సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. ఇందారం గనిపై ఏర్పా టు చేసిన రెండు కేంద్రాల్లో ఐకే 1ఏ కాన్పరెన్స్ హలులో 664 గాను 595 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఐకే1ఏ క్యాంటీన్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 553 గాను 516 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రామకృష్ణాపూర్, డిసెంబర్ 27: రామకృష్ణాపూర్లో ఆర్కేపీ ఓసీపీలో మొత్తం 471 మంది కార్మికులకు గాను 454 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగరేణి ఏరియా దవాఖాన పోలింగ్ కేంద్రంలో 158 మందికి గాను 150 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బెల్లంపల్లి, డిసెంబర్ 27: బెల్లంపల్లి ఏరియా లోని సింగరేణి ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 94.9 శాతం ఓటింగ్ నమోదైంది. 78 మంది కార్మికులకు గాను 74 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మందమర్రి ఏరియాలోని శాంతిఖని గనిలో 461 ఓట్లకు గాను 439 మంది ఓటు వేయగా 95.228 ఓటింగ్ శాతం నమోదైంది. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ శాంతిఖని క్యాంటీన్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.