రామగిరి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో సింగరేణి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, సంక్షేమంలోనూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణికి 134 యేండ్ల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి దిశా నిర్దేశంలో ఎన్నడూ సాధించని అత్యుత్తమ వృద్ధిని సాధించిందన్నారు. తెలంగాణ రాక ముందు సింగరేణి సంస్థ టర్నోవర్ రూ.11,928 కోట్లు ఉండగా.. 9 యేండ్లలో 176 శాతం వృద్ధితో గతేడాది రూ.32,978 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇంతటి వృద్ధిని దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించలేదన్నారు. మహారత్న కంపెనీతో పోలిస్తే సింగరేణి ద్వితీయ స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాక పూర్వం 2014లో రూ.419 కోట్ల లాభాలు గడించిన సింగరేణి.. గతేడాది 421 శాతం వృద్ధితో రూ.2,184 కోట్ల లాభాలు గడించిందని స్పష్టం చేశారు. ఇది కూడా మరే ఇతర ప్రభుత్వ సంస్థ సాధించని ఘనమైన వృద్ధి అని ఉద్ఘాటించారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39 శాతం వృద్ధిని సాధించామని, 9 యేండ్లలో 14 కొత్త గనులను ప్రారంభించుకున్నామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన సంస్థ కూడా సింగరేణి అని, ఇప్పటివరకు 19,463 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద 15,250 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా 4,207 మందికి ఉద్యోగులు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగులు 45 శాతం యువకులే ఉన్నారన్నారు. కార్మికుల కోసం 2 వేల విశాలమైన డబుల్ బెడ్రూం ఇండ్లను భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెంలో నిర్మించినట్లు పేర్కొన్నారు.
కార్మికుల సొంతింటి నిర్మాణం కోసం రూ.10 లక్షల గృహ రుణంపై వడ్డీని సింగరేణి సంస్థ చెల్లిస్తున్నదన్నారు. ఉచిత కరెంట్, ఉచిత ఏసీ కనెక్షన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. మ్యాచింగ్ గ్రాంట్ను రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు చేశామని, దేశంలో మరే ఇతర బొగ్గు పరిశ్రమలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆదేశంతో రిటైర్మెంట్ వయసు 61 యేండ్లకు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన విద్యుత్ను అందించడంలో సింగరేణి తనవంతుగా థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్ కూడా అందిస్తున్నదని పేర్కొన్నారు. సింగరేణి ప్రస్తుతం 67 మిలియన్ టన్నుల నుంచి రానున్న ఐదేండ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు. దీని కోసం ఎనిమిది కొత్త గనులను ప్రారంభిస్తున్నదని తెలిపారు. విద్యుత్ సామర్థ్యాన్ని 4వేల మెగావాట్లకు పెంచేలా థర్మల్, సోలార్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించబోతున్నామన్నారు. తద్వారా రూ.32 వేల కోట్ల టర్నోవర్ రూ.50వేల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇదంతా కార్మికులు, అధికారుల సమష్టి కృషి, అంకితభావంతో సాధ్యమవుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈ అండ్ఎం డీ సత్యనారాయణ, గనుల సలహాదారు డీఎన్ ప్రసాద్, అడ్వయిజర్ ఫారెస్టు సురేంద్ర పాండే, కో-ఆర్డినేషన్ జీఎం ఎం సురేశ్, లక్ష్మణ్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి ఆర్జీ-1 ఆధ్వర్యంలో..
గోదావరిఖని, జూన్ 2 : ఆర్జీ-1 జీఎం ఆఫీసు వద్ద జీఎం చింతల శ్రీనివాస్ జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. అనంతరం టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్, బీఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య, ఏఐటీయూసీ నాయకుడు రంగు శ్రీనివాస్. సీఐటీయూ నాయకుడు రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు జయశంకర్ సార్, అమరవీరుల చిత్రపటాలు, అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు పోనోగోటి శ్రీనివాస్, రాంమోహన్, రామ్మూర్తి, బానోతు సైదులు, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రామకృష్ణ, ఆంజనేయులు, ఆంజనేయ ప్రసాద్, నవీన్, మదన్మోహన్, అభిలాష్, కిరణ్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
ఎన్టీపీసీ, ఓపెన్ కాస్ట్ గనులపై..
జైపూర్, జూన్ 2: ఎస్టీపీపీలో సీటీసీ సంజయ్కుమార్ ష్యూర్ జాతీయ జెండా ఆవిష్కరిం చి ఉద్యోగులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందారం ఓపెన్కాస్టు గనిపై ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఎస్టీపీపీలో చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జైన్సింగ్, సముద్రాల శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, ఐకే ఓపెన్కాస్టు గనిపై మేనేజర్లు బ్రహ్మాజీరావు, నాగన్న, పిట్ సెక్రటరీలు గడ్డం మల్లన్న, రత్నాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలో..
మందమర్రి, జూన్ 2 : జీఎం కార్యాలయ ఆవరణలో జీఎం మోహన్రెడ్డి జాతీయ జెం డాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయ న కేక్ కట్ చేసి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్వోటూ జీఎం రాజేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనజర్ శ్యామ్ సుందర్, డీవై పీఎం మైత్రేయ బంధు, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు రాజేందర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జీ-3లో వైభవంగా..
రామగిరి, జూన్ 2 : ఆర్జీ-3, ఏపీఏ ఏరియా లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సెంటినరీకాలనీలోని స్టేడియంలో అమరవీరుల స్తూపం, జయశంకర్ చిత్రపటానికి ఏపీఏ జీఎం కే వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, అధికారులు ఎం నరేందర్, ఎన్ రాధాకృష్ణ, ఎలీషా, సీతారాం, బైద్య, రఘుపతి, శ్రీనివాసులు, వెంకటరమణ, జైనుల్లబద్దీన్, విలాస్ శ్రీనివాస్, చంద్రశేఖర్, కర్ణ, పద్మరాజు, ఐలయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్లో..
రామకృష్ణాపూర్, జూన్ 2 : జీఎం జీ మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో 40 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూపర్ బజార్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పట్టణంలోని రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజేశ్వర్రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, బ్రాంచ్ కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ, అక్బర్అలీ, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, అధికారుల సంఘం అధ్యక్షుడు రాజేందర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డీవై పీఎం మైత్రేయ బంధు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో..
యైటింక్లయిన్కాలనీ, జూన్ 2 : టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆర్జీ-2 డివిజన్ ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి, జాతీయ జెండా ఆవిష్కరించారు. బదావత్ శంకర్నాయక్, చెరుకు ప్రభాకర్ రెడ్డి, ఆకుల రాజిరెడ్డి, బేతి చంద్రయ్య, బానాకర్, ముస్కుల అనిల్ రెడ్డి, కొంగర రవీందర్, ఐ సత్యం, అమ్మిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సంపత్ రెడ్డి, ధరణి మల్లేశ్వర్రావు, సూర్యశ్యాం తదితరులు పాల్గొన్నారు. షిర్కే బస్టాండ్లో నగర కార్పొరేటర్ సాగంటి శంకర్, బీ శంకర్ తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ అధ్యక్షుడు మేడి సదానందం, ముస్కే శ్రీనివాస్, పులి రాకేశ్, దాసరి బాలరాజు, గూడెల్లి రాంచందర్, కుమార్యాదవ్, రవి, పాషా పాల్గొన్నారు. ఖని టూటౌన్ పోలీస్ స్టేషన్లో టౌన్ సీఐ సూరం వేణుగోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ సిబ్బందితో గౌరవ వం దనం స్వీకరించారు. ఎస్ఐ కళాధర్రెడ్డి, ఏఎస్ఐ సుధాకర్, రామలక్ష్మి, జలీల్, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు బూడిద సమ్మయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాయకులు వీరాస్వామి, బూడిద ఓదేలు, రమ, సరస్వతి, కిరణ్, మంథని రాజయ్య, కే లక్ష్మయ్య, సదానందం, అనిల్, పాషా, శ్రీను, రాజు, రమేశ్ పాల్గొన్నారు.
ఆర్జీ-2 ఏరియాలో..
యైటింక్లయిన్కాలనీ, జూన్ 2 : ఆర్జీ-2 ఏరియాలో జీఎం ఐత మనోహర్ ఆధ్వర్యంలో వే డుకలు నిర్వహించారు. ముందుగా షిర్కే బ స్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం జీఎం కార్యాలయంలో కేక్ కట్ చేసి జాతీ య పతాకాన్ని ఎగురవేశారు. డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ప్రాజెక్టు అధికారి, అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
గోలేటి జీఎం కార్యాలయంలో..
రెబ్బెన, జూన్ 2 : బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్ అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం జెండాను అవిష్కరించి జెండాకు వందనం సమర్పించారు. ఏరియాలోని కైర్గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్పీ, వివిధ డిపార్టుమెంట్లు, కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏరియా ఎస్వోటూ జీఎం గుప్తా, ఏరియా ఇంజినీర్ తిరుమల్రావు, ఏరియా పర్సనల్ మేనేజర్ ఐ లక్ష్మణ్రావు, డీజీఎం(సివిల్) సతీశ్బాబు, డీవైపీఎం తిరుపతి, సీనియర్ పీవో కిరణ్కుమార్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో..
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కైర్గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్పీ, వివిధ కార్యాలయాలు, డిపార్టుమెంట్లలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమి టీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, మాజీ ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్, జీఎం కమిటీ సభ్యులు చంద్రశేఖర్, మారిన వెంకటేశ్వర్లు, సమ్మయ్య, పిట్ కార్యదర్శి కార్నా థం వెంకటేశం, నాయకులు భాస్కరాచారి, న ర్సింగరావు, రాజేశం, ఓరం కిరణ్, కైత స్వామి, బొంగు వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
శాంతిఖని గనిపై ..
బెల్లంపల్లి, జూన్ 2: పట్టణంలోని శాంతిఖని గని ఆవరణను ప్రత్యేకంగా అలంకరించారు. గని మెయిన్ గేట్, ఇతర ప్రదేశాల వద్ద పూలతోరణాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా శాంతిఖని ఏజెంట్ విజయ్ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి, అమరవీరుల చిత్రపటా ల వద్ద పూలు వేసి నివాళులర్పించారు. అనంత రం గని మేనేజర్ సంజయ్కుమార్ సిన్హా, టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరి యా నాయకులు వెంకటరమణ, రాజనాల రమేశ్ జాతీయ జండాను ఆవిష్కరించారు.
శ్రీరాంపూర్లో..
శ్రీరాంపూర్, జూన్ 2 : శ్రీరాంపూర్లో ఏరి యా జీఎం సంజీవరెడ్డి, అధికారులు, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులతో కలిసి నస్పూర్కాలనీ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ వి గ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడే తెలంగా ణ అమరవీరుల స్తూపానికి పూలమాలలతో ఘ నంగా నివాళులర్పించారు. అనంతరం జీఎం కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో సేవా సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, ఇన్చార్జి ఎస్వోటూ జీఎం గోపాల్సింగ్, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదీర్, ఓసీపీ పీవోలు శ్రీనివాస్, పురుషోత్తంరెడ్డి, ఏజెంట్ ఏవీ రెడ్డి, డీజీఎం అరవిందరావు, చిరంజీవులు, శివరావు, చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ పీవో కాంతారావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.