వాంకిడి, మార్చి 27: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ వద్ద బుధవారం ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.1లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరబాద్కు వెళ్తుండగా, నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పేరొన్నారు. ఏఎస్ఐలు పోశెట్టి, ఉల్లాస్, సిబ్బంది ఉన్నారు.
సిర్పూర్(టీ), మార్చి 27 : మండలంలోని వెంకట్రావ్ పేట్ గ్రామ సమీపంలో ఎస్ఐ దీకొండ రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన గంగులోతు రాందాస్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 1లక్ష నగదును పట్టుకున్నారు. నగదును సీజ్ చేసి, ఎఫ్ఎస్టీ టీంకు అప్పగించినట్లు తెలిపారు.