ఆదిలాబాద్ టౌన్, మార్చి 25 : ప్రతి ఒక్కరూ భక్తి మార్గం ద్వారా తమలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలను దైవత్వంలో లీనం చేస్తూ శాంతి స్థాపనకు పాటుపడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో శ్రీ రుద్ర సహిత శత చండీ మహాయా గం అత్యంత వైభవోపేతంగా సాగుతున్నది. రెండో రోజైన శనివారం నిర్వహించిన మహాయాగంలో ఎమ్మెల్యే జోగు రామన్న సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల సూచనల ప్రకారం యాగాన్ని పూర్తి చేసి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు.
చైత్ర నవరాత్రులను పురస్కరించుకొని మహా యాగాన్ని చేపడుతుండగా.. లక్ష పుష్పార్చన, దీపార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో మహాయాగ క్రతువు కొనసాగుతున్నది. యాగం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ఆలయంలో చేపడుతున్న మహాయాగంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న మహాయాగంలో భాగస్వామ్యులు కావాలని కోరారు.