ఎదులాపురం, సెప్టెంబర్ 2 : సూపర్ స్పెషలిటీ దవాఖానల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, పేషంట్ కేర్, శానిటేషన్ సిబ్బందికి పెండింగ్ వేతనలు విడుదల చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా రిమ్స్లో శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీకి టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షురాలు బియ్యాల అనసూయ మాట్లాడుతూ.. కార్మికులందరికీ రూ.15,600 వేతనం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఇందుకు సహకారం అందించిన ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్ అనుదీప్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే మోహన్, జిల్లా కోశాధికారి ఎన్ నగేశ్, దవాఖాన సెక్యూరిటీ గార్డులు ప్రమోద్, ఎన్ అమోల్, రజినీకాంత్, సంతోష్, స్వామి, దిలీప్, దాసు, శివన్న, రాకేశ్, విజయ్ సాయి తదితరులు పాల్గొన్నారు.