పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు మెరుగైన వైద్య అందిస్తున్నది. మహిళలు గర్భం దాల్చింది మొదలు వారి డెలివరీ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. గర్భిణులకు అవసరమైన మందులు పంపిణీ చేయడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్కానింగ్ నిర్వహిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ చికిత్స అందిస్తున్నది. మగపిల్లాడు పుడితే రూ.12 వేలు, ఆడశిశువు జన్మిస్తే రూ.13 వేలు కేసీఆర్ కిట్లో భాగంగా తల్లీబిడ్డలకు అందిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. పీహెచ్సీల్లో నెలకు 20 నుంచి 40 డెలివరీలు అవుతున్నాయి.
ఆదిలాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉండేది. వసతుల లేమి.., మందులు కొరత.., వైద్యులు, సిబ్బంది ఖాళీలు.. ఇలాంటి సమస్యలతో పేదలకు వైద్యం సరిగా అందేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సర్కారు వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అన్ని సౌకర్యాలతో దవాఖానల భవనాలు నిర్మించింది. వైద్యులు, సిబ్బంది నియామకం.., మందుల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితంగా సర్కారు దవాఖానలకు వచ్చే వారి సంఖ్య క్రమం గా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 5 పట్టణ ఆరో గ్య కేంద్రాలు.., 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు.., నిర్మల్లో 4 యూపీహెచ్సీలు.., 20 పీహెచ్సీలు ఉన్నాయి. ప్రభుత్వం పేదలకు వీటిల్లో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నది. టీ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ దవాఖానలకు వచ్చి, వారి రక్త నమూనాలు సేకరించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెండు జిల్లాలో కరోనావైరస్తో పాటు సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పడింది. సర్కారు వైద్యంపై నమ్మకంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం తీసుకుంటున్నారు.
గతంలో గర్భిణులు వైద్యం కోసం ప్రైవేటు ద వాఖానలను ఆశ్రయించే వారు. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని దవాఖానలకు పోయి పరీక్ష లు చేయించుకునే పరిస్థితి ఉండేది. ప్రభుత్వం గ ర్భిణుల కోసం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి గ్రామాల్లో ఉండే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వారి వివరాలు సేకరించి, ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 102 అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తీసుకెళ్లి స్కా నింగ్, ఇతర పరీక్షలు చేయిస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యం అందిస్తున్నారు. గర్భిణులకు ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా అం గన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నారు. వారు పనులకు పోకుండా మంచి ఆహారం తీసుకునేందుకు మగపిల్లాడు పుడితే రూ.12 వేలు, ఆ డ శిశువు పుడితే రూ.13 వేలు అందిస్తున్నారు. కే సీఆర్ కిట్లో భాగంగా తల్లీబిడ్డలకు అవసరమైన 16 రకాల వస్తువులను అందిస్తున్నారు. ప్రభు త్వం తీసుకున్న చర్యలతో గర్భిణులు సర్కారు ద వాఖానల్లో వైద్యం తీసుకుంటున్నారు. గతంలో ప్రైవేటులో వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వ సాయం అందుతున్నది.
ప్రభుత్వం గ్రామాల్లో అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం, మా ఆశ కార్యకర్తల నుంచి ఏఎన్ఎంలు, వైద్యులు కల్పించే ఆరోగ్య అవగాహనతో ఇప్పుడు సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. భీంపూర్ పీహెచ్సీ పరిధిలో 108, 102 అంబులెన్సులు ఉండడంతో వాటితో అత్యవసర పరిస్థితుల్లో మారుమూల గ్రామాలకు వెళ్లి పీహెచ్సీకి గానీ, అవసరమైతే ఆదిలాబాద్ రిమ్స్కు తరలించి సుఖ ప్రసవం పొందేలా చూస్తున్నాం. ప్రభుత్వ విధానాలతో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోలో కూడా ప్రసవాల మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఏడాదికి 250 వరకు డెలివరీలు చేస్తున్నాం.
– విజయసారథి, వైద్యుడు, భీంపూర్ పీహెచ్సీ
తలమడుగు మండల కేంద్రానికి ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఆల్ట్రాసోనోగ్రాఫీ మిషిన్ అందజేసింది. నెలలో ఒక్కసారి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి, గర్భిణులకు స్కానింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఐదుసార్లు శిబిరాలను ఏర్పాటు చేసి, 200 మందికి స్కానింగ్ చేశాం. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక వాహనంలో గర్భిణులను పీహెచ్సీకి తీసుకవచ్చి, పరీక్షల అనంతరం ఇంటికి పంపిస్తున్నాం. రిమ్స్ రేడియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ గర్భిణులకు స్కానింగ్ చేస్తున్నారు. స్కానింగ్లో ఇబ్బందులు ఉన్నవారిని గైనకాలజిస్ట్లకు రెఫర్ చేస్తున్నాం. అవసరమైన వారికి మందులను అందిస్తున్నాం. – రాహుల్, వైద్యుడు, తలమడగు పీహెచ్సీ