మంచిర్యాల అర్బన్. జనవరి3: సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంచిర్యాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషత్ధ్వని సూచించారు. బుధవారం మంచిర్యాలలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రీ బాయి ఫూలే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
సావిత్రీ బాయి ఫూలేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు రంగాల్లో సేవలందించిన మహిళలకు సావిత్రీ బాయి పూలే అవార్డులను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తయ్య, బీసీ నాయకులు అత్తి సరోజ, జ్యోతి, రాధిక, కౌన్సిలర్లు మేరుగు మహేశ్వరి, బండి పద్మ, శ్రీనివాస్, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సుమలత, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్, జనవరి 3: మహాత్మా జ్యోతిబాఫూలే యువజన సంఘం ఆధ్వర్యంలో చెన్నూర్లో సావిత్రీ బాయి పూలే జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సావిత్రీబాయి పూలే విగ్రహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, కౌన్సిలర్లు తుమ్మ రమేశ్, జగన్నాథుల శ్రీను, మహాత్మా జ్యోతిబాఫూలే యువజన సంఘం నాయకులు తాటికొండి సురేశ్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చకినారపు రాజేశ్, తగరం అశోక్, చెన్నూరు రాజేశ్, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్గిల్డా, ఖాజాకమురొద్దీన్, షఫీ, మేడ సురేశ్రెడ్డి, కోమటిపల్లి రమేశ్, జడల మల్లేశ్, రవికుమార్, ఎనగందుల గోపి, జాడి సంపత్, చెన్న శ్రీకాంత్, ప్రశాంత్రెడ్డి, బొజ్జ శివ పాల్గొన్నారు.
మందమర్రి, జనవరి 3: చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను బుధవారం మందమర్రి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని నార్లాపూర్ బస్టాండ్ వద్ద ప్రజా కుల సంఘాల నాయకులు సావిత్రీబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు, వీహెచ్పీఎస్ జాతీయ నాయకుడు పెద్దపల్లి సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు గాజుల ప్రతాప్, వెల్ది ప్రభాకర్, కోరె చిన్న గట్టయ్య, గోపతి శ్రీనివాస్, ఏనుగుల బీరయ్య, చేగొండ సత్యనారాయణ, కొలిపాక రమేశ్, శ్రీనివాస్, ఆదివాసీ సంఘం నాయకులు మేసినేని మనోహర్, కూన సత్యం, బైర్నేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 3 : పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డీ సుమతి, వైస్ ప్రిన్సిపాల్ కే శివలీల, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ వీ స్వప్న, యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ ఎం జ్యోతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
పట్టణంలోని చార్వాక చారిటబుల్ ట్రస్టు భవనంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గౌడ్ ఉదారి ఆధ్వర్యంలో సావిత్రీ బాయి జయంతిని నిర్వహించారు. అనంతరం విద్యా, సామాజిక సేవలు అందిస్తున్న జిల్లాలోని వివిధ మండలాల నుంచి 20 మంది ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లను సావిత్రీబాయి పూలే అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుణ, పట్టణ ఇన్చార్జి తిరుపతి, బీసీ నాయకులు గాజుల ముఖేశ్గౌడ్, పల్లె భూమేశ్, అత్తి సరోజ, బండ శాంకరి, రాజేశం, మోహన్ కృష్ణ, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, నాయకులు తదితరులున్నారు.
మంచిర్యాల ఏసీసీ, జనవరి 3 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సావిత్రీబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మహిళా సావిత్రీబాయి పూలే అని కొనియాడారు. అనంతరం నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నీయకులు ఎస్కే.సల్మాన్ (బీసీఎస్ఎఫ్), బచ్చలి ప్రవీణ్ (బీజేఎస్), పూరేళ్ల నితీశ్ (ఎస్ఎస్యూ), బచ్చలి అభిరాము (టీవీయూవీ)లు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 3 : కోటపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ హరిత ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బావనపల్లి ప్రాథమిక పాఠశాలలో జయంతిని నిర్వహించారు.
భీమారం, జనవరి 3 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన సావిత్రీబాయి జయంతి వేడుకల్లో తహసీల్దార్ బత్తుల విశ్వంబర్, సీనియర్ అసిస్టెంట్ రాజ్ మహమ్మద్, ఆర్ఐ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, జనవరి 3: భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే 193వ జయంతి వేడుకలను దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులున్నారు.
బెల్లంపల్లి, జనవరి 3: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టీ.ఎస్.ప్రవీణ్కుమార్, లెక్చరర్లు, విద్యార్ధులు పాల్గొన్నారు. పట్టణ పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఆదర్శ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆకిరెడ్డి శంకర్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, నాయకులు తొంగల రాజేశం, తొంగల శ్రీనవాస్, బగ్గని శేషుకుమార్, కందుల రాజన్న, సాగర్వర్మ, రమేశ్, అచ్చ శివ, బియ్యాల గణేశ్, ముత్తె వెంకటేశ్, భార్గవ్, సందెల మల్లేశ్, చిరంజీవి పాల్గొన్నారు.
కాసిపేట, జనవరి 3 : కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ము బాపు, సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య ప్రిన్సిపాల్ సరిత పాల్గొన్నారు. ముత్యంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, కాసిపేట దిశ మోడల్ స్కూల్, నాయకపుగూడలో ప్రాథమిక పాఠశాల, గట్రావ్పల్లిలో నిర్వహించిన వేడుకల్లో ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.