అతి ఏదైనా అనర్థమే.. పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే.. ఇది దేనికైనా వర్తిస్తుంది.. ఆ కోవలోకే వస్తుంది విద్యుత్. కరెంట్ను మనం ఎంత పొదుపు చేస్తే అంత భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఫ్యాన్లు, బల్బులు వేయడం వంటివి చేస్తే ఇటు కరెంట్తో పాటు మనం ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్శాఖ ఆధ్వర్యంలో అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ఈ వారోత్సవాల్లో ప్రజలకు వివిధ అంశాలపై అధికారులు వివరిస్తున్నారు. విద్యుత్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా, ప్రమాదం జరిగినా టోల్ఫ్రీ నంబర్ 18004250028కు ఫోన్ చేయాలని, 1012 హెల్ప్లైన్ వాడుకోవాలని సూచిస్తున్నారు.
మంచిర్యాల, మే 6 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ పొదుపుతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించాలన్న తలంపుతో కేంద్ర ప్రభుత్వం 2001లో ‘ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టు’ తీసుకొచ్చింది. ఈ యాక్టు 2007, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ యాక్టు గొడుగు కింద మరో సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ’ (బీఈఈ) మార్చి 1, 2002లో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యుత్ డిమాండ్, సరఫరాలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం, మున్సిపాలిటీల నిర్వహణ, బహుళ అంతస్థు భవనాల్లో నీటి సరఫరా, గృహాల్లో ఉపయోగించే విద్యుత్ దీపాల వినియోగంలో పొదుపు కార్యక్రమాలను చేపట్టే పనికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మే 1 నుంచి వారం పాటు విద్యుత్ పొదుపు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. చర్చలు, సదస్సులు, వర్క్ షాపులు, వక్తృత్వ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించి, విద్యుత్ ఆదాపై ప్రజల్లో అవగాహన పెంచి, వారిని పొదుపు దిశగా పయనించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తున్నారు.
విద్యుత్ను ఆదా చేసి రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పాటునందించాలని వివిధ కార్యక్రమాల ద్వారా వివరిస్తున్నారు. విద్యుత్ను అనవసరంగా ఖర్చు చేయవద్దని, గదుల్లో సహజసిద్ధంగా వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలని, అన్ని కిటికీలు తెరిచి ఉంచాలని, అన్ని కేటగిరీలకు చెందిన వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడాలని సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 22 సెక్షన్లలోనూ, గ్రామ పంచాయతీల్లో, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్ఈ రమేశ్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 6న డివిజన్లలో అవేర్ నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 425 0028కు కాల్ చేయవచ్చు. హెల్ప్లైన్ నంబర్ 1912కు కాల్ చేసినా సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
పొదుపు.. మలుపు..
సాధారణంగా ఎంత పొదుపుగా ఉంటే అంత వృద్ధిలోకి వస్తాం. ఒక వస్తువును అవసరం మేరకే వాడాలి. అదేపనిగా పట్టపగలు కూడా విద్యుద్దీపాలు వెలిగించడం విరివిగా విద్యుత్ వాడకమే అవుతుంది. చీకటిలో మాత్రమే, వెలుగు అవసరమైనప్పుడే విద్యుత్ దీపాలు వాడుతూ పొదుపు చేయాలి. విద్యుత్ వినియోగం పొదుపుగా చేస్తే, మరికొంత సేపు విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పొదుపుగా పనిచేయడం సామాజిక బాధ్యత కూడా. పనిలో పొదుపుపై అవగాహన ఉంటే ఖర్చయ్యే కాలం కూడా కలిసి వస్తుంది.
ఎల్ఈడీ బల్బులే మేలు..
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎల్ఈడీ బల్బులను వాడడం మంచిది. ఎక్కువ కాంతి లభించ డమే కాకుండా, తక్కువ కరంటు వాడకంతో బిల్లు కూ డా తగ్గుతుంది. మూడువాట్ల ఎల్ఈడీ బల్బు 45 వాట్ల ఫిలమెంట్ బల్బుతో సమానం కాగా, 90 శాతం విద్యు త్ను ఆదా చేస్తుంది. ఇది కార్బన్ను వాతావరణంలో విడుదల చేయదు. పర్యావరణ సమతుల్యానికి ముప్పురాకుండా ఎంతగానో తోడ్పడుతాయి. ఎల్ఈడీ బల్బుల ఖరీదు ఎక్కువే అయినప్పటికీ ఫిలమెంట్ బల్బుల కంటే పదింతలు ఎక్కువ కాలం మన్నుతాయి.
ప్రమాదాలు.. నివారణ..
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి..
విద్యుత్ను పొదుపు చేసే మహత్కా ర్యంలో విజయం సాధిం చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్య తగా వ్యవహ రించాలి. విద్యుచ్ఛక్తిని దుర్వినియోగం చేస్తే సమాజానికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇండ్లల్లో వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలినే వాడాలి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు తీసేయాలి. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఎల్ఈడీ బల్బులను వాడితే ఎక్కువ కాంతితో పాటు తక్కువ కరంటు వాడకంతో బిల్లు కూడా తగ్గుతుంది. రిఫ్రిజిరేటర్ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ చేయడంతో కరెంటు వృథా కాదు.
– ఎం.రమేశ్ బాబు, ఎస్ఈ, మంచిర్యాల