మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 23: జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరన కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు శుక్రవారం ఓడిబియ్యం, సీరె, సారె, బంగారం (బెల్లం), ముడుపులు సమర్పించి, కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించారు. గోదావరి తీరంలో గుడారాలు వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూం నుంచి జాతరను పోలీసులు పరిశీలించారు. పార్కింగ్ను పర్యవేక్షించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఎత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు రాజకుమారి దంపతులు కుమారుడు బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్రావు వారి మొక్కును తీర్చుకున్నారు.
హాజీపూర్, ఫిబ్రవరి 23 : మండలంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన సబ్బెపల్లి-గుడిపేట గ్రామాల శివారులోని బుగ్గగట్టు ప్రాంతంలో సమ్మక్క జాతర వైభవంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
లక్షెట్టిపేట, ఫిబ్రవరి 23 : పట్టణ మున్సిపాలిటీలోని గోదావరి తీరాన జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తులు పూజలు చేశారు. లక్షెట్టిపేట సీనియర్ సివిల్ జడ్జ్ అర్పితా మారం రెడ్డి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీ సభ్యులు, పట్టణ ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా ఆలయ కమిటీ సభ్యులు కానుగంటి మల్లయ్య, నిమ్మ రత్నాకర్, బుద్దె రామన్న, మొల్దారం రవి, గడికొప్పుల కిష్టయ్య, వేముల రాజగురువయ్య, కట్ల చంద్రయ్య, పెట్టెం శ్రీనివాస్, ఎనగందుల లక్ష్మణ్, దుంపటి కుమారస్వామి జాతరకు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
కోటపల్లి, ఫిబ్రవరి 22 : మండలంలోని నక్కలపల్లి, మల్లంపేట, రాపనపల్లి గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మల జాతరలో భక్తులు మొక్కులు చెల్లించారు.
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 23 : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే1ఏ గని సమీపంలో పాలవాగు ఒడ్డున కొలువైన సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. మందమర్రి మండలంలోని గ్రామాలతో పాటు, జైపూర్, కాసిపేట, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30 వేలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో తాండూర్(మందమర్రి ఇన్చార్జి) సీఐ శ్రీనివాసరావు పర్వవేక్షణలో రామకృష్ణాపూర్ ఎస్ఐ జీ రాజశేఖర్,
మందమర్రి ఎస్ఐ ఆర్ రాజశేఖర్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, బెల్లంపలి ఎస్ఐ ప్రవీణ్, ఆర్ఎస్ఐ శివకుమార్, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 90 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించడంతో జాతర ప్రశాంతంగా సాగింది. జాతరలో సింగరేణి విభాగాలైన సివిల్, రెస్క్యూ విభాగం, సింగరేణి మెడికల్ విభాగం సిబ్బంది, ప్రభుత్వప్రాథమిక ఆరోగ్య కేంద్రం (మందమర్రి) వైద్య సిబ్బంది, సెక్యూరిటీ విభాగాలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు సేవలందించారు.
సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 23: సీసీసీ ముక్కిడిపోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క జాతర వేడుకల్లో సింగరేణి అధికారులు పాల్గొని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరాంపూర్ ఇన్చార్జి జీఎం రఘుకుమార్, డీజీఎం పర్సనల్ అరవిందరావు, తదితర అధికారులు అమ్మవార్లకు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయుసీ డిప్యూటీ బ్రాంచ్ కార్యదర్శి కొమురయ్య, సీనియర్ పీవో కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి, ఫిబ్రవరి 23 : మండలంలోని మంగెనపల్లి గ్రామ శివారులో సమ్మక్కకు శుక్రవారం ఎంపీటీసీ సంతోష్కుమార్, మాజీ సర్పంచులు గాలి మధు, బొద్దున శంకర్, దుర్గక్క, జగన్, రామచంద్రం , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ దర్శించుకున్నారు.