మంచిర్యాల, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీల అమలులో భాగంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఐదు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు తీసుకున్నారు. కాకపోతే రేషన్ కార్డు లేనోళ్లు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చా.. రేషన్ కార్డు ఉన్నోళ్లే చేసుకోవాలా.. అనే విషయంపై అ ధికారులు ఒక్కొక్కరూ ఒక్కో తీరు సమాధానమివ్వడం పై ప్రజలు పరేషాన్ అవుతున్నారు. రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలకు అర్హులని, రేషన్కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని భిన్న ప్రకటనలు రావడంతో క్లారి టీ లేకుండా పోయింది.
రేషన్ కార్డు లేదు దరఖాస్తు చే సుకోవచ్చా.. అన్న ప్రశ్నకు అధికారుల నుంచి రకరకాల సమాధానాలు వచ్చాయి. ‘రేషన్ కార్డు లేదని మేము రా సుకుంటామని.. మీరు దరఖాస్తు చేసుకోండని కొందరు అధికారులు చెబుతుండగా.. మీరిచ్చే దరఖాస్తులో రేషన్ కార్డు లేదని రాసి ఇవ్వండని మరికొందరు.. రేషన్ కార్డు లేదని లేఖ రాసి దరఖాస్తుకు జత చేయండని ఇంకొందరు..’ ఇలా ఎవరికి తోచినట్లు వారు చెబుతుండడంతో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వాళ్లంతా విస్తుపోవాల్సి వ స్తున్నది.
ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందతున్న వారు మళ్లీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలా.. అవసరం లేదా.. అనే విషయంలోనూ క్లారిటీ లేకుండా పోయింది. ఆసరా పింఛన్ల విషయంలో మా త్రమే అప్లికేషన్లో (ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వా రు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు) అని స్ప ష్టంగా పేర్కొన్నారు. కొన్ని చోట్ల పింఛన్లు వస్తున్నప్పటికీ మరోసారి దరఖాస్తు చేసుకోవాలేమోనని వచ్చిన వృద్ధులను అధికారులు తిరిగి పంపించేయడం కనిపించింది. దీంతో వృద్ధులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ప్రతి మండలానికి రెండు బృందాల చొప్పున ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించేందుకు వచ్చా యి. ఒక్కో బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరో గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాయి. మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు ఒక వార్డు ఆఫీసర్, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఆరు వార్డులకు కలిపి ఒక సూపర్వైజర్, నాలుగు వార్డులకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో తొలిరోజు నాలుగు గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం పూర్తయ్యింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కుటుంబ సభ్యుల ఆధార్కార్డు జిరాక్స్లు, రేషన్ కార్డు జిరాక్స్, ఒక పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటో వెంట తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.
కొన్ని మండలాల్లో రెండు గ్రామాలు ఒక పంచాయతీగా ఉన్న దగ్గర కాస్త ఇబ్బంది ఏర్పడింది. పంచాయతీ మొత్తానికి ఒకే బృందం రావడంతో దాదాపు రెండు, మూడు కిలోమీటర్లు పోయి దరఖాస్తులు ఇవ్వాల్సి వచ్చింది. తొలిరోజు ప్రజాపాలన నిర్వహించిన గ్రామాలన్నీ తక్కువ జనాభా ఉన్నవి కావడంతో ఇబ్బందులు ఏర్పడలేదు. జన సందడి కూడా తక్కువగా కనిపించింది. రానున్న రోజుల్లో దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకైనా దరఖాస్తు విషయంలో అధికారులు ఓ క్లారిటీ ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, చెన్నూర్ పట్టణంతో పాటు కాగజ్నగర్లో దరఖాస్తు ఫారాలు అయిపోవడంతో పలువురు దరఖాస్తుదారులు వెనుదిరిగి వెళ్లారు.
నస్పూర్, డిసెంబర్ 28 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన’కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల కోసం మొదటి రోజు 8,425 దరఖాస్తులు, అలాగే 7 మున్సిపాలిటీల్లో 14,890 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 28 : నా పేరు పోసక్క. మాది అక్కెపల్లి గ్రామం కింద ఉండే శివలింగాపూర్. ఇండ్లు, పింఛన్లు కావాల్సినోళ్లు దరఖాస్తులు చేసుకొమ్మని చెప్పిన్రు. గందుకే అక్కెపల్లికి నడుసుకుంట (కిలోమీటర్) వచ్చిన. నాకు పింఛన్ వస్తలేదు. ఫారం నింపించి సార్లకు ఇచ్చిన. మా ఊరిలో కౌంటర్ పెడితే నాకు ఈ గోస తప్పేది.