టీఆర్ఎస్ సర్కారు చొరవతో జీపీల అభివృద్ధి
ఊరూరా సీసీ రోడ్లు.. మారుతున్న రూపు రేఖలు
ఆనందంలో ప్రజలు
లక్షెట్టిపేట రూరల్, జూన్ 23 : తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఏ ఊరు చూసినా సీసీ రోడ్లతో కళకళలాడుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మండలాల వారీగా సీసీ రోడ్లు..
చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి మండలంలో రూ. కోటీ 41 లక్షల 50 వేలు, జైపూర్ మండలంలో రూ. 2 కోట్ల 15 లక్షలు, చెన్నూరు మండలంలో రూ.2 కోట్ల 71 లక్షలు, కోటపల్లి మండలంలో రూ. 2 కోట్ల 25 లక్షలు, భీమారం మండలంలో రూ. 2 కోట్ల 25 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. బెల్లంపల్లి నియోజక వర్గంలోని వేమనపల్లి మండలంలో రూ. 67 లక్షలు, బెల్లంపల్లి మండలంలో రూ. 66 లక్షలు, నెన్నెల మండలంలో రూ. 81 లక్షలు, కన్నేపల్లి మండలంలో రూ.65 లక్షలు, భీమిని మండలంలో రూ. 55 లక్షలు, తాండూరు మండలంలో రూ. 70 లక్షలు, కాసిపేట మండలంలో రూ. 93 లక్షలు సీసీ రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలంలో రూ. 3 కోట్ల 23 లక్షలు, హాజీపూర్ మండలంలో రూ. కోటీ 82 లక్షలు, లక్షెట్టిపేట మండలంలో రూ. 2 కోట్ల 15 లక్షల నిధులను సీసీ రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేసింది. అంతేగాకుండా ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలో రూ. 10 లక్షలు సీసీ రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేసింది. లక్షెట్టిపేట మండలంలో ఉపాధి హామీ ద్వారా రూ. 2 కోట్ల 15 లక్షలతో అంతర్గతంగా సీసీ రోడ్లు నిర్మించారు.
ఏ గ్రామానికి ఎన్ని ఉపాధి నిధులు..
తిమ్మాపూర్కు రూ. 15 లక్షలు, అంకతిపల్లెకు రూ. 10 లక్షలు, బలరావుపేటకు రూ. 5 లక్షలు, చందారానికి రూ. 13 లక్షలు, దౌడేపల్లికి రూ. 8 లక్షలు, ఎల్లారానికి రూ. 15 లక్షలు, గుల్లకోటకు రూ. 10 లక్షలు, హన్మంతుపల్లెకు రూ. 20 లక్షలు, జెండావెంకటాపూర్కు రూ. 15 లక్షలు, కొత్తకొమ్ముగూడేనికి రూ. 15 లక్షలు, కొత్తూరుకు రూ. 5 లక్షలు, లక్ష్మీపూర్కు రూ. 10 లక్షలు, మిట్టపల్లికి రూ. 10 లక్షలు, పాతకొమ్ముగూడేనికి రూ. 5 లక్షలు, పోతపల్లికి రూ. 5 లక్షలు, రంగపేటకు రూ. 5 లక్షలు,సూరారానికి రూ. 4 లక్షలు, వెంకట్రావుపేటకు రూ. 45 లక్షల ఉపాధి నిధులు మంజూరు చేయగా, అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
సీఎం కేసీఆర్ పుణ్యమే..
సమైఖ్య రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా అధ్వానంగా ఉండే. కనీసం రోడ్లు కూడా సరిగా ఉండేటివి కావు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది. సీఎం కేసీఆర్ వల్ల ఉద్యమ ఫలాలు అందరికీ అందుతున్నయ్.
– జెవారే గౌతం, అందుగులపేట, మందమర్రి మండలం
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి..
రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే దివాకర్రావు సహకారంతోనే గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో గ్రామంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నాం. గతంలో పల్లెల్లో అంతర్గత రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత ఉపాధి నిధులు, పల్లె ప్రగతి నిధులతో మా గ్రామాన్ని అభివృద్ధి చేశాం. అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీలు నిర్మించాం. ప్రతి రోజూ మంచినీరు సరాఫరా చేస్తున్నాం. శుభ్రత, శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాం.
– చుంచు రవి, తిమ్మాపూర్ సర్పంచ్,లక్షెట్టిపేట మండలం