అంబేద్కర్ చౌక్ : ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని మార్లవాయిలో ఆదివాసీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆదివాసీ కళాకారులకు సాంస్కృతిక సారధిలో అవకాశాలు కల్పించాలని కోరారు. మారుమూల ప్రాంత ఆదివాసీ గ్రామాలకు లింకురోడ్లు మంజూరు చేయడంతో పలు విషయాలపై వినతిపత్రం అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.