దండేపల్లి, జనవరి 24 : మండలంలోని నాగసముద్రం గ్రామంలో బుధవారం రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర కనుల పండువగా సాగింది. గ్రామస్తులందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు చుట్టు పక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మ తల్లిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, పూదరి రమణయ్య, వెంకటరమణ, గొట్ల భూమన్న, ముద్దసాని తిరుపతి, మల్లేశ్ తదితరులు ఉన్నారు.
చింతపెల్లికి చెందిన ఎండీ రవూఫ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్థానిక నాయకులతో కలిసి పరమార్శించారు. అనంతరం రూ.5 వేల సాయమందించారు. అధైర్యపడవద్దు.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఉపసర్పంచ్ అక్కల తిరుపతి, లింగంపెల్లి బాపు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.