గర్మిళ్ల, జనవరి 27 : ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కల్పించేలా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సీపీ శ్రావ ణ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్కేశ్వరం సందర్శన
భీమారం , జనవరి 27 : మంచిర్యాల జిల్లాలోనే ఓడీఎఫ్ ప్లస్ గ్రామంగా ఎన్నికైన ఎల్కేశ్వరం గ్రామాన్ని అదనపు కలెక్టర్ రాహుల్ , పంచాయతీ అధికారి ఫణిందర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ , పల్లెప్రకృతి వనం, పారుశుధ్య నిర్వహణ, పంచాయతీ ఖర్చులు, నిర్వహణ , పంచాయతీ పన్నులు వసూలు చేసినందుకు గాను అక్కడి పంచాయతీ కార్యదర్శి సవ్య ను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడిపె సమ్మయ్య , ఎంపీవో సతీశ్ రెడ్డి , పంచాయతీ రాజ్ ఏఈ రవి , ఏపీవో ఎస్తర్ డేవిడ్ , ఈసీ శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.