రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది. దీంతో పాటు పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో వానకాలంతో పాటు యాసంగి పంటల వివరాలను ఆన్లైన్లో వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నమోదు చేయిస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఈ ప్రక్రియ ఇప్పటికే వంద శాతం పూర్తి కాగా, పంటల లెక్క పక్కాగా తేలింది. జిల్లా వ్యాప్తంగా 2,63,631 ఎకరాల్లో పంటలు వేయగా, ఇందులో వరి, మక్క, శనగకు ప్రాధాన్యమిచ్చినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది.
నిర్మల్, మార్చి 2(నమస్తే తెలంగాణ): పంటలకు మద్దతు ధర, మా ర్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నది. వానకాలంతో పాటు యాసంగిలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నా రు. కాగా యాసంగి పంటలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో నిర్వహించిన నమోదు ప్రక్రియ ఇప్పటికే 100 శాతం పూర్తి కాగా, క్షేత్ర స్థాయి సిబ్బంది పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,63,631 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేసినట్లు గుర్తించారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో గతేడాది యాసంగి కంటే ఈ యేడు సాగు విస్తీర్ణం కొంత మేరకు పెరిగింది. గత యాసంగిలో జిల్లా రైతులు 2,45,178 ఎకరాల్లో పంటలను సాగు చేయగా, ఈ సారి 2,63,631 ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది కంటే 18,453 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. అధికారులు సైతం ఈ యాసంగిలో 2.40 లక్షల నుంచి 2.50లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ముందుగా అంచనా వేశారు. లక్ష్యానికి మించి పంటలు సాగవుతుండడంతో అందుకనుగుణంగా అధికారులు పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన స స్యరక్షణ చర్యలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా రు. ఈ యాసంగిలో అధికంగా వరి, మక్క, శనగ పంటల సా గుకే రైతులు మొగ్గు చూపారు. జిల్లాలో మొత్తం 79 వ్యవసాయ క్ల స్టర్లు ఉండగా, ఆయా క్లస్టర్ల పరిధిలోని ఏఈవోలు సర్వే నంబర్ల వారీ గా ఏ పంట వేశారో వివరాలను నమోదు చేశారు. కాగా ఈ యాసంగిలో 2,63,631 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయగా, ఇందులో వరి 1,00,846 ఎకరాలు, మక్క 82,759 ఎకరాలు, శనగ 67,413 ఎకరాల్లో సాగు చేశారు. వీటితో పాటు జొన్న 6,355, గోధుమ 629, ఎర్ర జొన్న 273, పల్లీలు 122, ఆవాలు 454, కుసుమ 107, నువ్వులు 3977, పొద్దు తిరుగుడు 305, పె సర 90 ఎకరాల్లో సాగు చేశారు.
నిర్మల్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లో 79 ఏఈవో క్లస్టర్లు ఉ న్నాయి. ప్రతి క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణాధికారిని ప్రభుత్వం నియమించింది. వీరు జిల్లా వ్యాప్తంగా 79 క్లస్టర్లలో ప్రతి రోజూ పంటల సాగు వివరాలను నమోదు చేశారు. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్నది ఏఈవోలు ఇప్పటికే నమోదు చేశారు. అంతేకాకుండా ప్రతీ సర్వే నంబర్లోని సబ్ డివిజన్లలో రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలు పక్కాగా సేకరించారు. ఇలా సేకరించిన వివరాలను రైతుబంధు ఆన్లైన్ యాప్లో ఏఈవోలు అప్లోడ్ చేశారు.
దిగుబడి ఎంత వస్తుందనేది పక్కాగా అంచనా వేసేందుకు ఈ పంటల సాగు వివరాల సేకరణ ఉపయోగపడనున్నది. ఫలానా పంట ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నదని తెలుసుకోవడంతో పాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం క ల్పించడం, కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ వివరాల సేకరణ దోహదపడనున్నది. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, అవసరమైన మేరకు గన్నీ బ్యాగులు తెప్పించడం వంటివి చేస్తారు.
యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతు లు వేసిన పంటల వివరాలను పూర్తిగా సేకరిం చాం. పంటల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేశాం. గతేడాది కం టే ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సారి వానలు సమృద్ధిగా కురియడం, నాణ్యమైన కరెంటు సరఫరా, పెట్టుబడి సహాయం అందడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగానే రాష్ట్ర ప్ర భుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల శనగ పంట దిగుబడులు మార్కెట్కు వస్తున్నాయి. ముథోల్, తానూర్, బాసర, కుభీర్, భైంసా మండలాల పరిధిలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
-అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, నిర్మల్