జైపూర్, మార్చి 21: పార్లమెంటు ఎన్నికల నియామావళిలో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిష నర్ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందా రం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ ఔట్ పోస్టును సందర్శించారు.
తనిఖీలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది రాత్రి వేళల్లో రేడియం జాకెట్స్ ధరించాలని సూచించారు. వాహనదారుల వద్ద రూ. 50 వేల పైచి లుకు ఉంటే స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. వీటితో పాటు బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లయితే సీజ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.