జైపూర్, సెప్టెంబర్ 20 : అంకిత భావంతో విధు లు నిర్వర్తించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జైపూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం సాయంత్రం సందర్శించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టికాల్స్ గురించి కోర్టు డ్యూటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిషిప్షన్, పెట్రోల్ మొబైల్, క్రైమ్ టీమ్స్, టేక్ టీమ్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేరాల నియంత్రణలో భా గంగా సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భూ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని, కోర్టు ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకునేలా ప్రజలకు సహకరించాలన్నారు. అంతకుముందు ఏసీపీ న రేందర్, సీఐ రాజు, ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. చెన్నూర్ సీఐ ప్రవీణ్కుమార్ జైపూర్ సబ్డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.