నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 1: జిల్లా అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిర్మల్ జిల్లా కలెక్టర్కు కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ కలెక్టర్గా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించిన వెంట నే వివిధ సెక్షన్లకు వెళ్లి వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని ఉద్యోగుల వివరాలు, బాధ్యతలు, ఇతర వివరాలను అదనపు కలెక్టర్ రాంబాబు కొత్త కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లాలో పని చేస్తున్న వివిధశాఖల అధికారులు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ముందుగా ఎంపీడీవోలతో సమావేశమై జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలో వీసీ గది, టెక్నాలజీ, సమావేశ మందిరం, రికార్డుల గది, ఇతర వివరాలను పరిశీలించారు. ఉద్యోగులను అప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీసీవో శ్రీనివాస్రెడ్డి, ఆయాశాఖల అధికారులు రాజేశ్వర్గౌడ్, అంజిప్రసాద్, హన్మాండ్లు, శంకరయ్య, శంకర్, స్రవంతి, అశ్వక్అహ్మద్, సాయిబాబా, నరేందర్, తహసీల్దార్లు సుభాష్చందర్ ఉన్నారు.
కలెక్టర్ను కలిసిన టీఎన్జీవో ఉద్యోగులు
నిర్మల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వరుణ్రెడ్డిని టీఎన్జీవో ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, టీఎన్జీవో ఉద్యోగులు పాల్గొన్నారు.
అందరి సహకారంతోఅభివృద్ధి చేశా
అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించానని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనను జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, అధికారులు అంజిప్రసాద్, హన్మాండ్లు, రాజేశ్వర్గౌడ్, లోకేశ్వర్రావు, విజయలక్ష్మి, ధన్రాజ్, సాయిబాబా, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.