హాజీపూర్, డిసెంబర్ 21 : మంచిర్యాల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని పెంచడానికి అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా బుధవారం అమలు చేశాడు. నిరంతరం వారు నిర్వహించే విధులు సహా పంచాయతీ రాజ్ చట్టంపై 25 ప్రశ్నలతో ప్రశ్నాపత్రాన్ని స్వయంగా రూపొందించాడు. 20 నిమిషాల వ్యవధిలో నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి క్విజ్ పోటీలు నిర్వహించాడు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశప్రగతి గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకమైందని అన్నారు. కార్యదర్శులు సాంకేతికంగా ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలి. విధి నిర్వహణలో నిబద్ధత, పూర్తిస్థాయి నైపుణ్యత కలిగి ఉండాలి. ఈ క్రమంలోనే వారి నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగిందని, అవసరమైతే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.