సిరికొండ, అక్టోబర్ 4 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సర్పంచ్ నర్మదా అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నూతన పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 70 మందికి నూతన పింఛన్ డబ్బులు అందజేశామని తెలిపారు. పింఛన్ రాని వారికి రెండో జాబితాలో వస్తుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పర్వీన్, టీఆర్ఎస్ నాయకులు స్వామి, ఎక్బాల్, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని నిపాని, అందర్బంద్, కామట్వాడ, అర్లి(టీ), భీంపూర్ గ్రామాల్లో సర్పంచ్లు లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల నగదు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు పెండెపు కృష్ణయాదవ్, కేమ రాజన్న, తాటిపెల్లి లావణ్య, గొల్లి రమాబాయి, మడావి లింబాజీ, పోస్ట్మాస్టర్ భగవాండ్లు, తదితరులు పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 4 : పేదలందరూ అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎంపీటీసీ రాకేశ్ అన్నారు. మండలంలోని సాంగిడి, కొగ్దూర్, మాంగ్రూడ్ గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మంగేశ్ ఠాక్రే, కన్నల మహేందర్, మణియార్పూర్ సర్పంచ్ తేజ్రావ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.