హాజీపూర్, ఏప్రిల్ 12 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ పల్లె ప్రకృతి వనంతో పాటు 10 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ పాలనలో వాటికి రక్షణ కరువైంది. హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపల్లి గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలోని చెట్లను కొం దరు శుక్రవారం నరికివేశారు. 2007లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో భూసేకరణ కింద అప్పటి ప్రభుత్వం ఈ బృహత్ పకృతి వనానికి సంబంధించిన ఆరు ఎకరాలను సేకరించింది.
ఎకరానికి రూ.1 82 లక్షల చొప్పు న పరిహారం సైతం చెల్లించింది. 2021లో మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ. 9 లక్షలను ఖర్చు చేసి 35 వేల పూలు, పండ్లు, తదితర మొక్కలతో బృహత్ ప్రకృతి వనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మొక్కలను సంరక్షిస్తూ వస్తున్నారు. కానీ పరిహారం తీసుకున్న వ్యక్తులే శుక్రవారం మా భూమిలో కావాలనే మొక్కలు నాటారం టూ వాటిని కొట్టేస్తున్నట్లు అధికారులకు సమాచారం వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఏపీవో మల్లయ్యను ఘ టనా స్థలానికి పంపించారు.
ఈ మేరకు అక్కడికి వెళ్లిన ఆయనతో గతంలో ఆరు ఎకరాలకు పరిహారం తీసుకున్న వ్యక్తులు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. అప్పటి బీఆర్ఎస్ సర్పంచ్, ఎంపీపీ, మాజీ ఉపసర్పంచ్ కావాలని ముం పులో పోయిన తమ భూమిలో మొక్కలను నాటించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రస్తు తం తాము(కాంగ్రెస్) అధికారంలో ఉన్నామ ని, తమదే నడుస్తుందంటూ ఏపీవోకు వార్నిం గ్ ఇచ్చినట్లు సమాచారం.
విషయం తెలుసుకొని అక్కడికి కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులతో నూ సదరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ట్లు తెలిసింది. ఎంత కాంగ్రెస్ నాయకులైతే మాత్రం పరిహారం తీసుకున్న భూమిలో ప్రభుత్వం నాటిని నాటిన చెట్లను నరికి వేయ డం, పైగా అధికారులనే దబాయించడం ఏమిటని ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో మధుసూదన్ను వివరణ కోరగా పకృతివనం లో చెట్లను నరికేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.