మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 13 : క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ నెల 19న తమిళనాడులో జరిగే సాధారణ ఎన్నికల విధులకు వెళ్తున్న 64 మంది హోంగార్డులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు.
సీపీ మాట్లాడుతూ ఎన్నికల విధులను నిబద్ధతతో పూర్తి చేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.