మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 12 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివా స్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నారోటి క్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్ను రామగుండం అధికారులతో కలిసి ఆవిషరించారు.
సీపీ మాట్లాడుతూ గంజాయికి బానిసలుగా మారి యువ త తమ భవిష్యత్తును నాశనం చేసుకొంటుందని, దాని వల్ల తల్లిదండ్రులు మానసిక క్షోభ కు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలంద రూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. గంజాయి రహిత కమిషనరేట్ కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.