నేరడిగొండ : గ్రామాల్లో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్క నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం పార్కులను ఏర్పాటు చేయించిందన్నారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
నాటే విధానంపై పలు సూచనలు అందించారు. అనంతరం గ్రామంలోని పురాతన ఖిల్లా కోటను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీఆర్డీవో ఎస్ కిషన్, ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ గాదె సమత, తాసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, ఏపీవో వసంత్రావు, నాయకులు గాదె శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.