ఎదులాపురం,డిసెంబర్13 : జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఐదోరోజు ఏజెన్సీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. 999 అభ్యర్థులకు గాను 700 మంది హాజరు కా గా, 374 మంది అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రాత పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. అ లాగే 20 మంది ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు హా జరుకాగా 18 మంది అర్హత సాధించారన్నారు.
ముఖ్యంగా ఏజెన్సీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది పాత ఏజెన్సీ సర్టిఫికెట్లను కలిగి ఉండి , కొందరు నాన్ ఏజెన్సీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా అని తప్పుగా ఆన్లైన్లో నమోదు చేసి , జీవో నంబర్ 24 ప్రకారం ఏజెన్సీ సర్టిఫికెట్లు లేనటువంటి 202 అభ్యర్థులకు ఈ నెల 17,19 తేదీల్లో తిరిగి అవకాశాన్ని కల్పించాలని పోలీస్ నియామక మండలికి విన్నవించమన్నారు. ఏజెన్సీ ఏరియా అభ్యర్థులు ఈ నెల 17 వరకు ఏజెన్సీ సర్టిఫికెట్లు తీసు కు రావాలన్నారు. నియామక మండలి ద్వారా అభ్యర్థులకు తిరిగి అడ్మిట్ కార్డు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
పరీక్షల్లో పాల్గొన్న అధికారులు అడిషినల్ ఎస్పీ సయమ్జాన్రావు, డీఎస్పీలు ఉమేందర్, వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, ఉపేందర్, సీహెచ్ నగేందర్, జీవన్ రెడ్డి , పోలీసు కార్యాలయ ఏవో యూనిస్ అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది జిల్లా సీఐలు, ఆర్ఐలు , ఎస్ఐ లు, ఆర్ఐలు ఐటీకోర్ , ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ క్యూర్టీ ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.