ఉట్నూర్ రూరల్, నవంబర్ 19 : ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని జడ్పీటీసీ చారులత రాథోడ్ అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామంలో ఆదివారం డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్ర వేశపెట్టి నిరుపేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింద న్నారు. కారు గుర్తుకు ఓటు వేసి, ఖానాపూర్ నియోజకవర్గ బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ను భారీ మె జార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెందుర్ కళావతి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ము జీబ్, సిడాం సోనేరావ్, పవార్ భారత్, నాయకులు పాల్గొన్నారు.
లక్కారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్సుకోల తిరుపతి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లును అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోల సత్తన్న, భూమన్న, మక్బుల్, బలవంత్, ముంజం అనుదీప్, గంగేశ్వర్, ఆశన్న, మర్సుకోల సరస్వతి, పోసక్క, బబిత, రంజనాబాయి, రాజమణి, దూట మహేందర్, సాజిత్ సిద్దికి, గంగరాజు, కేశవ్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నడ్డంగూడ గ్రామంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్ నాయకులతో కలిసి ముమ్మరం ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
పులిమడుగు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బాబా శ్యాం, ప్రదీప్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ కర పత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 19 : కారు గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్షన్ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా మండలాధ్యక్షుడు బడుగు మల్లేశ్ కోరారు. మండలంలోని కోశగుట్ట, రావిగుడెం గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, చెట్టి ధర్మేందర్, మోహన్రెడ్డి, సూతారి రమేశ్, బోరె రమేశ్, రియాజ్, గోధూరి సరోజ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్, నవంబర్ 19 : ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖానాపూర్ పట్టణంలోని ఐదోవార్డు టవర్స్ కాలనీలో పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఖానాపూర్తో పాటు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా సేవ చేసేందుకు వచ్చిన భూక్యా జాన్సన్నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేత శ్యాం, జగదీశ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఉట్నూర్, నవంబర్ 19 : బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ను గెలిపించాలని ఆ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు కొల్లూరు స్వామి ప్రజలను కోరారు. అంగడిబజార్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమాన అభివృద్ధి చేసింది కేసీఆరేనని పేర్కొన్నారు. కావున ఇంకా అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు. అనంతరం ఓటర్ లిస్ట్లో పేర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, నాతరి నరేశ్, ప్రమోద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 19 : మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధి రంగపట్లో బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తిరుగతూ కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భూక్యా జాన్సన్ నాయక్ను గెలిపించి, గ్రామాల్లో అభివృద్ధికి మార్గదర్శిగా నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, భూమేశ్, గ్రామప్తులు పాల్గొన్నారు.