ఇచ్చోడ(సిరికొండ), జూన్ 7 : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 60 గడపలు, 150 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఒక వ్యవసాయ బావి వద్ద ఏకంగా పదేసి మోటర్లతో కనెక్షన్లు ఇచ్చుకొని ఇండ్లకు నీటిని తరలించుకుంటున్నారు. గ్రామంలో పైపులు సరిగ్గా లేకపోవడంతో వారానికి ఒకట్రెండు రోజులు నీరు వస్తుందన్నారు. అధికారులు స్పందించి పైపులకు మరమ్మతులు చేసి రోజు నీరందించాలని కోరుతున్నారు.