కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వడగాంలోలాగే.. ఇక్కడా ఫాజిల్ పార్కు ఏర్పాటు చేసి.. వాటిని రక్షించాలని స్థానికులు కోరుతుండగా, సర్కారుకు నివేదికలందిస్తామని ఫారెస్ట్శాఖ చెబుతున్నది.
పెంచికల్పేట్, జనవరి 1 : దక్షిణ భారతదేశంలోనే కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్కు ఓ ప్రత్యేకత ఉంది. సిద్ధేశ్వర గుహ లు, ప్రాణహిత పెద్ద వాగు సంగమం, జలపాతాలు, ఎత్తైన కొండలు, పొడవు ముకు రాబందులు, గడ్డి మైదానాలు, పెద్ద పులులు, 250 రకాల పక్షి జాతులు, అరుదైన వృక్ష శిలాజాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
2013లో పెంచికల్పేట్ రేంజ్లోని కొండపల్లి, బొంబాయిగూడ అటవీప్రాంతంలో వృక్ష శిలాజాలను అధికారులు గుర్తించారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల వృక్షశిలాజాలు ఉన్నట్లు గుర్తించారు. పలుమార్లు సర్వేచేసి కొన్ని శిలాజాలు 9 నుంచి 25 అడుగుల పొడవు, మరికొన్ని 50 అడుగుల పొడువు ఉన్నట్లు తెలిపారు. 2015లో తెలంగాణ చరిత్రకారుల బృందం సైతం ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటి కలెక్టర్ చంపాలాల్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఫాజిల్ పారుగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటి వల్ల చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.
కొన్నేళ్లక్రితం మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోనున్న గడ్చిరోలికి 15కిలో మీటర్ల దూరంలోని వడగాంలో వృక్ష శిలజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి 6.5 కోట్ల ఏళ్లక్రితం ఏర్పడి ఉంటాయని జియలొజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు భావించారు. ఈ ప్రాంతాన్ని వడగాం ఫాజిల్ పారుగా అభివృద్ధి చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలోని శిలాజాల వయసు కూడా అంతే ఉంటుందని అంచనా వేశారు. కొండపల్లి నుంచి కొన్ని వృక్ష శిలాజాలలను మంచిర్యాలలోనగాంధారి వనానికి తరలించి సందర్శనకు ఉంచారు. ఇంతటి ప్రాచీనమైన ఈ శిలాజాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. వడగాం ఫాజిల్ పారులాగే.. కొండపల్లిలోనూ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెబుతున్నారు.