బెజ్జూర్, ఏప్రిల్ 4 : ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ పర్గెయిన్ అన్నారు. గురువారం బెజ్జూర్లోని అటవీ శాఖ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారాంతో కలిసి మాట్లాడారు. సాధారణంగా ఏనుగులు గుంపులుగా జీవిస్తాయని, ఓ గజరాజు పొరపాటున దారి తప్పి తెలంగాణ ప్రాంతానికి వ చ్చిందని, దాని ప్రవర్తన అసాధారణంగా మారిందన్నారు. అది ఇద్దరు రైతులను హత మార్చడం బాధాకరమని తెలిపారు. తెలంగాణ అడవుల్లోకి మొట్ట మొదటిసారిగా రావడంతోనే విచిత్రంగా ప్రవర్తిసుందని చెప్పారు. ప్రజలు, రైతులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆయా గ్రా మాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి డ ప్పు చాటింపులు, అవగాహన సదస్సులు ని ర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంతం లో ఏనుగుకు కావాల్సిన ఆహారం లేదని, అది ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో ఉండదని వివరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలు చే యకుండా సహకరిస్తే దాని దారిన అది వెళ్లిపోతుందని, లేదంటే పటాకులు పేల్చి దానిని తిరిగి మహారాష్ట్రకు పంపిస్తామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర నుంచి ఏనుగును అదుపు చేసే నిపుణుల బృందాన్ని పిలిపించామని, దాని ఆచూకీ తెలుసుకోవడానికి డ్రోన్లు వా డబోతున్నామన్నారు. రాత్రిళ్లు కూడా థర్మల్ డ్రోన్లతో ఏనుగు జాడ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో నీరజ్కుమార్ టెబ్రీవాల్, ఎఫ్ఆర్వో దయాకర్, డీఆర్వో శ్రావణ్ ఉన్నారు.