చెన్నూర్ రూరల్, జనవరి 18: గ్రామపంచాయతీల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు. గురువారం కిష్టంపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు.
ప్రతి గ్రామపంచాయతీలో 2024-25కు సంబంధించిన యాక్షన్ ప్లాన్, చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ దివాకర్ పాల్గొన్నారు.