మూడో రోజుకు చేరిన పల్లె, పట్టణ ప్రగతి పనులు
పాల్గొన్న ఎమ్మెల్యేలు జోగురామన్న, విఠల్రెడ్డి, రేఖానాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రగతి పనులు ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజులో భాగంగా ఆదివారం ఆదిలాబాద్, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు ఆయావార్డుల్లో పర్యటించి ప్రగతి పనులను పర్యవేక్షించారు. పల్లె, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 5: పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 14వ వార్డు సంజయ్ నగర్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ ఆదుముల్ల శైలజ, కౌన్సిలర్ సుజాత, నాయకుడు వాఘ్మారే శైలేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా ‘పట్టణ ప్రగతి’
ఖానాపూర్ టౌన్, జూన్ 5: అభివృద్ధే ధ్యేయంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శాంతినగర్కాలనీకి అనుకొని ఉన్న బొడోనికుంట పరిసర ప్రాంతాలను చైర్మన్ రాజేందర్తో కలిసి పరిశీలించారు. కాలనీ ప్రజలను విద్యుత్ , డ్రైనేజీ, మంచినీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బొడ్డోనికుంట ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని చైర్మన్ రాజేందర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ గంగాధర్, నాయకులు జన్నారపు శంకర్, పరిమి సురేశ్, మోయిన్, కొక్కుల ప్రదీప్, మహేశ్, కమిషనర్ జాదవ్ సంతోష్, ఏఈ తిరుపతి పాల్గొన్నారు.
పల్లె ప్రగతికి సమష్టిగా కృషి చేయాలి
లోకేశ్వరం, జూన్ 5 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు. మన్మథ్ గ్రామంలో రాష్ట్ర పరిశీలకుడు నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విజ్ఞానశాస్త్ర గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, స్పెషల్ ఆఫీసర్ క్రాంతికుమార్, ఎంపీపీ లలితాభోజన్న, మండల ఉపాధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, మండల కన్వీనర్ కరిపె శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రావు, మండల యూత్ అధ్యక్షుడు కపిల్, సోషల్ మీడియా అధ్యక్షుడు బండి ప్రశాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దిగంబర్, ఎంపీడీవోలు దేవేందర్రెడ్డి, గంగాధర్, సర్పంచులు ముత్తాగౌడ్, ఎంపీటీసీ లోలం జీవన్, లక్ష్మణ్ పటేల్, టీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్ లక్ష్మణ్రావు, నాయకులు, విఠల్ దాదా, సుదర్శన్రెడ్డి, శంకర్గౌడ్, ఎంపీవో సాల్మన్రాజ్, పంచాయతీ కార్యదర్శి సుప్రియ, ఈసీ అనిల్, టెక్నికల్ అసిస్టెంట్లు శారద, మంజుల, హరిత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.