దిలావర్పూర్, మార్చి 20 : సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్తో కూడిన వేతనం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దిలావర్పూర్ ఐకేపీ కార్యాలయంలో జిల్లా సెర్ప్ ఉద్యోగులు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీపీఎం విజయలక్ష్మి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ తమకు పేస్కేల్తో కూడిన వేతనం అందించేందుకు జీవో 11 జారీ చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో డీపీఎం వెంకటసాయి, ఐకేపీ ఏపీఎం సులోచనారెడ్డి, వివిధ మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు ముత్యం, సాయన్న,పోశెట్టి ఉన్నారు.
మామడలో..
మామడ,మార్చి 20 : మండలంలోని సెర్ప్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేసిన సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం అరుణ, సెర్ప్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ రవీందర్, సీసీలు రాములు, సతీశ్, సంతోష్, భూలక్ష్మి ఉన్నారు.
వడ్డీ లేని రుణాల మంజూరుపై హర్షం
ముథోల్, మార్చి 20: మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసినందుకు గాను మండలంలోని తరోడా గ్రామంలో సర్పంచ్ శ్వేత, రవికిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలోని 28 సంఘాలకు రూ. 4.50 లక్షలు వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, సీసీ పోశెట్టి, వీవోఏ ఓమేశ్వర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు రాధ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.