రైతు బీమా.. సీఎం కేసీఆర్ మదిలో పురుడు పోసుకున్న అద్భుత పథకం.. స్వయాన రైతు అయిన కేసీఆర్ అన్నదాతల కష్టాలు తెలిసి వారి పక్షాన నిలిచాడు.. రైతు నవ్వితే రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటుందని.. రైతును రాజుగా చేయడానికి, రైతు రాజ్యం నెలకొల్పడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. రైతు పక్షపాతిగా పథకాలు ప్రవేశపెట్టి జేజేలు అందుకుంటున్నాడు. రైతు మరణిస్తే వారి కుటుంబ పరిస్థితి ఏంటీ? అనే ప్రశ్నతో రైతు బీమా ప్రవేశపెట్టాడు. రైతు తరఫున జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)కు సర్కారే బీమా ప్రీమియం చెల్లించి, రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా రూ.5 లక్షలు చెల్లించే విధంగా తోడ్పాటునందిస్తున్నాడు. నిర్మల్ జిల్లాలో 2018 ఆగస్టు మాసం నుంచి అమలవుతున్నది.. ఇప్పటివరకు వివిధ కారణాలతో 2,469 మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు రైతుబీమా కింద పరిహారంగా రూ.123.45 కోట్ల సాయం అందింది. ఈ ఏడాది కొత్తగా మరో 7,193 మంది రైతులు రైతుబీమా లబ్ధిదారులుగా నమోదయ్యారు.
నిర్మల్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రైతన్న కుటుంబానికి ఏ కష్టం రావొద్దని.. వా రి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం కింద యేటా ఎకరానికి రూ. 10 వే లు అందిస్తూనే, వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. ఇందుకోసం యేటా రైతుబీమా పథకా న్ని పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతు మ రణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ. 5 లక్షలను అందజేస్తూ బతుకుపై భరోసానిస్తున్నది. నిర్మల్ జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 2,469 మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు రైతుబీమా కింద రూ. 123.45 కోట్లను అందజేసింది. జిల్లాలో రైతుబీమా కింద 1,17,454 మంది రైతులు ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా మరో 7,193 మంది రైతులు లబ్ధిదారులుగా నమోదయ్యా రు. ఒక్కో రైతుకు రూ.3,475 చొప్పున బీ మా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇదిలా ఉంటే వ్యవసాయ రంగానికి 24 గంట ల నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
ఐదేండ్లలో రూ.123.45 కోట్ల సాయం..
రైతుబీమా ఉన్న అన్నదాత మరణిస్తే వారం రోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు గత ఐదేండ్లలో 2469 మంది రైతులు మరణించగా, సంబంధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ. 123.45 కోట్లను అందజేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు మొదట్లో రూ.5 లక్షల బీమా డబ్బులను బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం, అనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. కాగా ఈ పథకాన్ని 2018 పంద్రాగస్టున సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాటి నుంచి 2018 లో 545మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ.27.25 కోట్లను అందజేసింది. అలాగే 2019 లో 512 మంది రైతులకు రూ.25.65 కోట్లు, 2020లో 694మంది రైతులకు రూ. 34.70 కోట్లు, 2021లో 613 మంది రైతులకు రూ.30.65 కోట్లు, 2022లో ఇప్పటి వరకు 105 మందికి రూ. 5.25 కోట్లను సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే జిల్లా వ్యాప్తంగా 1,75, 600మంది రైతులు ఉండగా, వీరిలో 1,17,454మంది రైతులు అర్హులుగా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. దీంతో ఈ ఏడు రైతుబీమా కోసం రూ. 40 కోట్ల 81 లక్షల 52వేల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది.
పెరిగిన రైతుబీమా పాలసీదారులు..
యేటా రైతుబీ మా పాలసీదారు లు పెరుగుతున్నా రు. ఈ ఏడా ది నిర్మల్ జిల్లా లో 7193 మం ది రై తులకు రాష్ట్ర ప్ర భు త్వం కొత్తగా ప్రీమియాన్ని చెల్లించింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 105 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు రైతుబీమా కింద రూ 5.25 కోట్ల ను ప్రభుత్వం అందజేసింది. వచ్చే యా సంగి పంటల సాగు ప్రణాళికను ఇప్పటికే రూపొందించాం. ఆ దిశగా క్షేత్రస్థాయి లో తమ సిబ్బంది రైతులకు పంటల సాగు పై దిశానిర్దేశం చేస్తున్నారు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, నిర్మల్