నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 6 : నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలను చేపట్టిన కర్నాటి వరుణ్ రెడ్డి తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరై అందరూ అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారు చెప్పే సమస్యను ఓపికగా విని పరిష్కరిస్తామని హామీనివ్వడంతో అర్జీదా రులు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించా రు. ఆర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను వివరించారు. మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్డీవో స్రవంతి, డీఆర్వో లోకేశ్, తహసీల్దార్లు పాల్గొ న్నారు. వరుణ్రెడ్డిని నిర్మల్ సాయిదీక్ష సేవా సమితి, గండి రామన్న ట్రస్టు ఛైర్మన్ లక్కాడి జగన్మోహన్రెడ్డి కలిశారు. నిర్మల్ మెప్మా పీడీ సుభాష్ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన వస్తువుల ను కలెక్టర్ వరుణ్రెడ్డి సోమవారం కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లా ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు గిరిజన సంప్రదాయం ఆదివాసీ కళా పెయింటింగ్, తదితర అంశాలను నేర్పించేందుకు రెండు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు రెండు నెలల పాటు ని ర్వహించే శిక్షణకు దరఖాస్తు చేసుకునే వారికి అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని, వారికి ఉచిత భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 10లోగా శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు జిల్లా మేనేజర్ ఫోన్ 9032383999 నంబర్లో సంప్రదించాలని సూచించారు.