నార్నూర్, ఫిబ్రవరి 6 : కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొడప మోతుబాయి జాకు పిలుపునిచ్చారు. గాదిగూడ మండలం సావిరి పంచాయతీ కార్యాలయంలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కంటి సమస్య ఉన్న వారికి ఆపరేషన్, మందులు, కళ్లద్దాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీల్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గాదిగూడ మండలం రూప్పాపూర్లో..
నార్నూర్, ఫిబ్రవరి 6 : 18 యేండ్లు పైబడిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని గాదిగూడ హెచ్ఈవో పవార్ రవీందర్ అన్నారు. గాదిగూడ మండలం రూప్పాపూర్ గ్రామంలో గాదిగూడ పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. కళ్లను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందించారు. సమస్యను బట్టి ఆపరేషన్ కోసం రెఫర్ చేస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి రజినీకాంత్, కంటి వెలుగు సిబ్బంది ఉన్నారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 : మండలకేంద్రంలోని ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం సాగుతున్నది. ప్రజలు శిబిరానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేసుకునేందుకు సోమవారం కౌంటర్ల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. కంటి చూపులో లోపం ఉన్నవారికి కండ్లద్దాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి కంటి పరీక్షలు చేసుకోవాలని వైద్యులు శ్రీకాంత్, గణేశ్ సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూప ర్ వైజర్ జాదవ్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ గేడం బలిరాం, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాథో డ్ సంధ్యారాణి, సిబ్బంది విలాస్, వినోద్కుమార్, రాకేశ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ముక్రా(కే)లో కంటి వెలుగు
ఇచ్చోడ, ఫిబ్రవరి 6 : మండలంలోని ముక్రా(కే) గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం సర్పంచ్ గాడ్గె మీనాక్షి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఏ కంటి సమస్యలున్నా నివారించేందుకు ఈ శిబిరాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. కాగా, కంటి వెలుగు శిబిరానికి వచ్చిన పలువురు వృద్ధులు పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.